Raviteja: సెన్సార్ పూర్తి చేసుకున్న 'టచ్ చేసి చూడు'

  • రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు'
  • పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ
  • వచ్చేనెల 2వ తేదీన విడుదల      

'టచ్ చేసి చూడు' అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రవితేజ రెడీ అవుతున్నాడు. వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రవితేజ అభిమానులంతా ఆ తేదీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని .. యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.

రేపు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటించిన ఈ సినిమాకి, ప్రీతమ్ సంగీతాన్ని సమకూర్చాడు. రవితేజ సరసన రాశిఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికలుగా అలరించనున్నారు. నల్లమలుపు బుజ్జి .. వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా, తనకి భారీ హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో రవితేజ వున్నాడు.     

More Telugu News