SRI CHITANYA: ఉత్తరాన్ని పిల్ గా స్వీకరించి శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు షాకిచ్చిన హైకోర్టు!

  • తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థను శాసిస్తున్న శ్రీచైతన్య, నారాయణ కళాశాలలు
  • ఈ కాలేజీల్లో ఆత్మహత్యలు పెరిగాయంటూ లేఖ రాసిన ఇమ్మానుయేల్
  • ఆ లేఖను పిల్ గా స్వీకరించిన హైకోర్టు

తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థను శాసిస్తున్న నారాయణ, శ్రీ చైతన్య కళాశాలల యాజమాన్యాలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. తెలుగు నాట పేరుగాంచిన ఈ కళాశాలల్లో ఈ మధ్య కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని వివరిస్తూ, ప్రకాశం జిల్లాకు చెందిన ఇమ్మానుయేల్ అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు.

ఆ ఉత్తరాన్ని పిల్‌ గా స్వీకరించిన హైకోర్టు సదరు కళాశాలల యాజమాన్యాలకు నోటీసులిచ్చింది. వాటితో పాటు దీనిపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్‌, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కూడా నోటీసులిచ్చింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News