mohanbabu: ‘గాయత్రి’ సినిమాలో తన పాత్ర గురించి వివరించిన యాంకర్ అనసూయ!

  • ‘గాయత్రి’లో శ్రేష్టా జయరామ్ పాత్ర పోషిస్తున్నా
  • ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా నటిస్తున్నా
  • ఓ పోస్టర్ విడుదల చేసిన అనసూయ

శ్రీ లక్ష్మి  ప్రసన్న పిక్చర్స్ సొంత బ్యానర్ పై డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘గాయత్రి’. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను ఈరోజు విడుదల చేసిన అనసూయ ఓ ట్వీట్ చేసింది.

‘వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పది..’ అంటూ ఈ చిత్రంలో తాను పోషిస్తున్న శ్రేష్టా జయరామ్ పాత్రను పరిచయం చేస్తున్నానంటూ ఓ పోస్టర్ ను జతపరిచింది. ఈ పోస్టర్ లో కుర్చీలో కూర్చొని ఉన్న అనసూయ ఇయర్ ఫోన్ ద్వారా ఏదో వింటూ, నోట్ చేసుకుంటూ కనిపిస్తుంది. ఆమె టేబుల్ పై ‘శ్రేష్టా జయరామ్, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్’ అనే నేమ్ ప్లేట్ ఉండటం గమనించవచ్చు. కాగా, ఈ చిత్రంలో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. విష్ణు సరసన శ్రియ నటిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 9న విడుదల కానుంది.

More Telugu News