Pawan Kalyan: కొండగట్టు చేరుకున్న పవన్ కల్యాణ్.. ఉత్సాహంతో అభిమానుల నినాదాలు!

  • కాసేపట్లో హనుమంతుడికి పూజలు
  • నినాదాలతో అభిమానుల ఉత్సాహం  
  • అభిమానులను అదుపులోకి తెచ్చిన పోలీసులు

'మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించండి' అంటూ ప్రకటన చేసిన సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు చేరుకున్నారు. కాసేపట్లో పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. పవన్ కల్యాణ్ అక్కడకు చేరుకున్న నేపథ్యంలో అభిమానులు ఉత్సాహంతో ఉరకలు వేశారు. ఆ ప్రాంతమంతా పవన్ కల్యాణ్ కి అనుకూల నినాదాలలో హోరెత్తిపోయింది. అభిమానులను పోలీసులు అదుపు చేశారు. అంజన్నను సందర్శించుకున్న తరువాత పవన్ కల్యాణ్ కరీంనగర్‌కు వెళ్లనున్నారు.

More Telugu News