actor mohan babu: ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం అభివృద్ధికి పాటుపడతా: నటుడు మోహన్ బాబు

  • దైవ సన్నిధానం చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ
  • ప్రత్యేక పూజలు చేయించిన శారదా పీఠాధిపతి
  • ఆధ్యాత్మిక విషయాలపై తనకు అవగాహన ఉందన్న మోహన్ బాబు

నటుడు మోహన్ బాబు ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానం చైర్మన్ గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆధ్యాత్మికంగా తనకు తగినంత విషయ జ్ఞానం ఉందని, ఈ నేపథ్యంలో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలయాన్ని సందర్శించాలని పిలుపునిచ్చారు. మోహన్ బాబు బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ, నటుడు మురళీ మోహన్, కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News