women missing: హైదరాబాద్ ఉమెన్స్ హాస్టల్ నుంచి యువతి అదృశ్యం!

  • కొన్ని రోజుల క్రితం హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లింది
  • ఇక తిరిగి రాలేదు
  • వాస్తవానికి ఇంటికి కూడా వెళ్లలేదు

హాస్టల్ లో ఉంటూ ట్రైనింగ్ పొందుతున్న ఓ యువతి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం ధూమాల గ్రామానికి చెందిన మనూష (19) అసెంబ్లీకి సమీపంలో ఉన్న ఐసీఐసీఐ అకాడమీలో ట్రైనింగ్ పొందుతోంది. చింతల్ బస్తీలోని ఓ హాస్టల్ లో ఆమె ఉంటోంది.

కొన్ని రోజుల క్రితం తన తండ్రికి బాగాలేదని చెప్పి హాస్టల్ నుంచి వెళ్లిన ఆమె, ఇంతవరకు తిరిగి రాలేదు. ఆమె రాని విషయాన్ని హాస్టల్ నిర్వాహకులు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో, వారు కూడా ఆమె కోసం వెతికారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో సైఫాబాద్ పీఎస్ లో ఆమె తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News