gowri theatre: అనంతపురం గౌరీ థియేటర్‌లో బ్రాహ్మణులకు 'జైసింహా' ప్రత్యేక ప్రదర్శన.. తరలి వచ్చిన బ్రాహ్మణ కుటుంబాలు!

  • 'జై సింహా'లో బ్రాహ్మణుల‌ను పొగుడుతూ బాల‌య్య డైలాగులు
  • బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా షో వేయించిన అనంతపురం ఎన్‌బీకే ఫ్యాన్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు 
  • చిత్ర బృందంతో కలిసి సినిమా చూసిన బ్రాహ్మణులు

కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ, హ‌రిప్రియ‌, న‌టాషా దోషి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం 'జై సింహా'కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ప్ర‌ధానంగా ఈ సినిమాలో బ్రాహ్మణుల‌ను పొగుడుతూ బాల‌య్య పేల్చిన డైలాగులు వైర‌ల్‌గా మారాయి. ఆ డైలాగులు బ్రాహ్మ‌ణుల‌కు తెగ‌న‌చ్చేయ‌డంతో అనంతపురం ఎన్‌బీకే ఫ్యాన్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్.. బ్రాహ్మణ కుటుంబాల‌ కోసం ప్ర‌త్యేకంగా ఈ సినిమా వేయించారు.

అంతేకాదు, జై సింహా హీరోయిన్ హరిప్రియ, రచయిత రత్నం, ఇతర చిత్ర బృందాన్ని కూడా బ్రాహ్మ‌ణుల‌తో క‌లిసి ఈ సినిమా చూడ‌డానికి అనంతపురానికి ఆహ్వానించారు. గౌరి థియేటర్‌లో ఈ సినిమా చూసిన‌ బ్రాహ్మణ కుటుంబాలు హ‌ర్షం వ్యక్తం చేశాయి. అనంత‌రం బ్రాహ్మణులను బాలయ్య ఫ్యాన్స్‌ ఘనంగా సన్మానించారు. 

  • Loading...

More Telugu News