Madhuri Dikshit: ఒకే ఫ్రేమ్ లో కాజోల్, మాధురీ దీక్షిత్, సోనాలీ బింద్రే... వైరల్ అవుతున్న ఫోటో!

  • అశేష సినీ అభిమానులను అలరించిన హీరోయిన్స్
  • తాజా చిత్రాన్ని చూసి అభిమానులు ఫిదా
  • తమను పాతికేళ్లు వెనక్కు తీసుకెళ్లారని వ్యాఖ్యలు

1990వ దశకంలో భారత అశేష సినీ అభిమానులను అలరించిన నటీమణుల త్రయం మాధురీ దీక్షిత్, సోనాలీ బింద్రే, కాజోల్ లు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కలసి సెల్ఫీలు దిగగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ముగ్గురు అందాల తారల ఫోటోను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్ హోత్రా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫోటోను చూసిన వారు ఫిదా అవుతూ, తాము ఓ పాతికేళ్లు వెనక్కు వెళ్లినట్టుగా ఉందని వ్యాఖ్యానిస్తుండటం విశేషం. మాధురి ప్రస్తుతం ఓ మరాఠీ చిత్రంలో నటించేందుకు సన్నద్ధం అవుతుండగా, కాజోల్, ధనుష్ హీరోగా నటించిన 'వీఐపీ-2'లో ఇటీవల కనిపించింది. సోనాలీ బింద్రే సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. వీరు ముగ్గురూ కలసి కనిపిస్తున్న చిత్రాన్ని మీరూ చూడవచ్చు.

More Telugu News