bollywood: బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో ఇజ్రాయెల్ ప్ర‌ధాని 'ఆస్కార్‌' రేంజ్ లో సెల్ఫీ!

  • సెల్ఫీ తీసిన బిగ్‌బీ అమితాబ్‌
  • గ‌తంలో ఆస్కార్ వేడుక‌లో సెల్ఫీ తీసిన ఎలెన్ డీజ‌న‌రీస్‌
  • ఆస్కార్ సెల్ఫీ రికార్డును తిర‌గ‌రాయాల‌ని ఆశించిన నెత‌న్యాహూ

భార‌త ప‌ర్య‌ట‌న చివ‌రి రోజులో భాగంగా ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెతన్యాహూ, బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారందరితో సెల్ఫీ దిగాల‌ని ఉంద‌ని ఆయ‌న కోరారు. అప్ప‌ట్లో ఆస్కార్ వేడుక‌లో హాలీవుడ్ న‌టుల‌తో యాంక‌ర్ ఎలెన్ డీజ‌న‌రీస్ తీసుకున్న సెల్ఫీలా ఉండాల‌ని నెత‌న్యాహూ ఆశించారు. దీంతో అంద‌రిలో పొడుగ్గా ఉన్న అమితాబ్ బ‌చ్చ‌న్ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీశారు. ఈ ఫొటోను బెంజిమ‌న్ నెత‌న్యాహూ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఆస్కార్ సెల్ఫీ రికార్డును ఈ బాలీవుడ్ సెల్ఫీ తిర‌గరాస్తుందా? అని ఆయ‌న పోస్ట్‌లో ప్ర‌శ్నించారు. ఈ సెల్ఫీలో ఐశ్వ‌ర్య రాయ్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌ల‌తో పాటు ర‌ణ‌ధీర్ క‌పూర్‌, వివేక్ ఒబెరాయ్‌, సారా అలీ ఖాన్‌, ద‌ర్శ‌కులు ఇంతియాజ్ అలీ,  మాధుర్ భండార్క‌ర్‌, నిఖిల్ అడ్వాణీ, అభిషేక్ క‌పూర్‌, సుభాష్ ఘయ్‌లు ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో బాలీవుడ్ చిత్రాల షూటింగ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో 'షాలోమ్ బాలీవుడ్' పేరుతో ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

More Telugu News