chiranjeevei: జపాన్ లో మన ‘మెగాస్టార్’ ఫొటో చూశానంటూ కేటీఆర్‌ ట్వీట్!

  • జపాన్ పర్యటనలో ఉన్న కేటీఆర్
  • ‘హమామట్సు’ లోని సుజుకి మ్యూజియంను సందర్శించిన మంత్రి
  • మ్యూజియంలో చిరంజీవి చిత్రపటం చూశా..చాలా గర్వంగా ఉంది
  • ఓ ట్వీట్ లో కేటీఆర్

జపాన్ దేశంలోని ఓ చిన్న పట్టణంలో ఉన్న ఓ మ్యూజియంలో మెగాస్టార్ చిరంజీవి చిత్ర పటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

షిజ్వోకా ప్రాంతంలోని హమామట్సు అనే చిన్న పట్టణంలో ఉన్న సుజుకి మ్యూజియంను తాను ఈరోజు సందర్శించానని, ఈ పర్యటన చాలా అద్భుతంగా అనిపించిందని పేర్కొన్న కేటీఆర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అదేంటంటే.. ‘ఇక్కడ ఎవరి చిత్ర పటాన్ని చూశానో ఊహించగలరా? మన మెగాస్టార్ చిరంజీవి. మన మాతృభూమికి చెందిన వారి ఫొటోను హమామట్సు లాంటి చిన్న పట్టణంలో చూడటం గర్వంగా అనిపించింది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మ్యూజియంలో ఉన్న చిరంజీవి చిత్ర పటం ముందు నిలబడి దిగిన ఫొటోను కేటీఆర్ పోస్ట్ చేశారు.

More Telugu News