sai pallavi: నేను చెయ్యనంటే చెయ్య .. 'దాగుడుమూతలు' గురించి సాయిపల్లవి!

  • హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'దాగుడుమూతలు'
  • నిర్మాతగా దిల్ రాజు 
  • పాత్ర నచ్చలేదంటోన్న సాయిపల్లవి

దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో 'దాగుడుమూతలు' అనే మల్టీ స్టారర్ తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో కథానాయకులుగా శర్వానంద్ - నితిన్ లను ఎంపిక చేసుకున్నారు. ఇక కథానాయికలుగా రకుల్ - సాయిపల్లవిలను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే సాయిపల్లవి ఈ సినిమా చేయడం లేదనేది తాజా సమాచారం.

తన కోసం అని చెప్పిన పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేని కారణంగా తాను చేయలేనని సాయిపల్లవి చెప్పేసిందట. దాంతో దిల్ రాజు - హరీష్ శంకర్ ఇద్దరూ కూడా ఇప్పుడు ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. నితిన్ తో దిల్ రాజు చేయనున్న 'శ్రీనివాస కల్యాణం' సినిమాలోను సాయిపల్లవిని అనుకోవడం .. ఆమె నో చెప్పడం తెలిసిందే. ఆ సినిమా కథ ఇంకా సాయి పల్లవికి చెప్పలేదన్న దిల్ రాజు, ఈసారి ఏం చేస్తారో చూడాలి మరి.    

More Telugu News