mohan babu: విశ్వ నట సార్వభౌమ అవార్డుతో మోహన్ బాబుకు సత్కారం

  • మోహన్ బాబును ఘనంగా సత్కరించిన టీఎస్ఆర్ 
  • దుశ్శాలువాతో సత్కరించి, అవార్డు అందజేత
  • ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు
  • హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు

ప్రముఖ సినీనటుడు మోహన్ బాబును ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో టీఎస్ఆర్ కళా పరిషత్ ఘనంగా సత్కరించింది. హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో టీఎస్ఆర్ - కాకతీయ మహోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మోహన్ బాబును దుశ్శాలువాతో సత్కరించి, అవార్డును అందజేశారు. విశ్వ నట సార్వభౌమ మోహన్ బాబును ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. 

More Telugu News