India: ఏడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా!

  • సెంచూరియన్‌లో రెండో టెస్టు
  • ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ (45) రబాడా (4)
  • దక్షిణాఫ్రికా స్కోరు ప్రస్తుతం 242/7 (85 ఓవర్లకి)

సెంచూరియన్‌లో జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయింది. మార్కమ్ 1, ఆమ్లా 1, డివిల్లియర్స్ 80,  ఎల్గర్ 61, డికాక్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయిన విషయం తెలిసిందే. షమీ 3 వికెట్లు తీయగా, జస్ప్రిత్ బుమ్రాకి రెండు వికెట్లు దక్కాయి. అనంతరం పేసర్‌ ఇషాంత్‌ శర్మ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. 73.4 ఓవర్ లో ఫిలాండర్‌ (26)ను అవుట్ చేయగా, అనంతరం 76వ ఓవర్‌ చివరి బంతికి కేశవ్‌ మహరాజ్(6) ను అవుట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ 45, రబాడా 4 పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా స్కోరు ప్రస్తుతం 242/7 (85 ఓవర్లకి)గా ఉంది. 

More Telugu News