amala paul: కోర్టు ఆదేశాల మేరకు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన హీరోయిన్ అమలాపాల్‌

  • గతంలో ఖరీదైన కారు కొన్న అమలాపాల్
  • తప్పుడు చిరునామా పత్రాలు సమర్పించి రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టిన వైనం
  • బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నటి
  • లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో ఎట్టకేలకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన హీరోయిన్‌

ప్రముఖ నటి అమలాపాల్ ఓ ఖరీదైన కారు కొని తప్పుడు ఆడ్రెస్సు పత్రాలు సమర్పించి రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కుంటోన్న విషయం తెలిసిందే. దీంతో ఆమెపై కేరళలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు.

ఇటీవల ఆమె బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, తిరస్కరించిన కోర్టు, క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె లొంగిపోయింది. తాను ఎటువంటి తప్పు చేయలేదని గతంలో చెప్పుకున్న ఆమె.. ఇప్పుడు తప్పును అంగీకరించినట్లు సమాచారం. ఆమె మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.  

More Telugu News