diamonds: వ‌జ్రాలు పొదిగిన చేతి గ‌డియారం... ధ‌ర రూ. 1.25 కోట్లు

  • 589 మేలుర‌కం వ‌జ్రాలతో త‌యారీ
  • త‌యారు చేసిన టాగ్ హ్యూవ‌ర్ సంస్థ‌
  • పేరు -  క‌నెక్టెడ్ మాడ్యుల‌ర్ 45 స్మార్ట్‌వాచ్

వ‌జ్రాలు పొదిగిన ఓ స్మార్ట్‌వాచ్‌ను స్విట్జ‌ర్లాండుకి చెందిన‌ టాగ్ హ్యూవ‌ర్ అనే సంస్థ త‌యారు చేసింది. దీని ధ‌ర 1,97,000 డాల‌ర్లు... అంటే భార‌త క‌రెన్సీలో రూ. 1.25 కోట్లు కంటే ఎక్కువ‌. దీని డయల్‌, బెల్ట్‌ను 18 క్యారెట్ల పాలిష్డ్‌ వైట్‌ గోల్డ్‌తో తయారుచేశారు. అంతేగాక..589 మేలిమి వజ్రాలను పొదిగారు. ఒక్కో వజ్రం ఖరీదు 334 డాలర్లు.

కనెక్టెడ్‌ మాడ్యులార్‌ 45 స్మార్ట్‌వాచ్‌ పేరుతో పిలుస్తున్న ఈ చేతి గ‌డియారాన్ని టాగ్‌ హ్యూవర్ సంస్థ ఇటీవ‌ల విడుద‌ల చేసింది. ఇప్పటికే మాడ్యులార్‌ 45 పేరుతో సాధారణ స్మార్ట్‌వాచ్‌ను తీసుకురాగా.. దాని ధర 1600 డాలర్లు మాత్రమే. ఇప్పుడు ఇదే పేరుతో డైమండ్‌ వెర్షన్‌లో వాచీని తీసుకొచ్చింది.

More Telugu News