mla: గుడిలో పూజ‌లు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు

  • పెద్ద‌ప‌ల్లి ఎమ్మెల్యే దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డిపై రైతుల ఆగ్ర‌హం
  • సంక్రాంతి సంద‌ర్భంగా పూజ‌లు చేయ‌డానికి గంగారం వెళ్లిన ఎమ్మెల్యే
  • సాగునీరు అంద‌లేద‌ని ఎమ్మెల్యేతో వాగ్వాదం

పంటసాగు కోసం నీరు విడుద‌ల చేస్తామ‌ని మాట ఇచ్చి, జాప్యం చేస్తున్న తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేపై రైతులు త‌మ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా గుడిలో పూజ‌లు చేయ‌డానికి త‌మ ఊరికి విచ్చేసిన పెద్ద‌ప‌ల్లి ఎమ్మెల్యే దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డిని కాల్వ‌శ్రీరాంపూర్ మండ‌లం గంగారం గ్రామ రైతులు మార్గ‌మ‌ధ్యంలోనే అడ్డుకున్నారు.

ఎమ్మెల్యే అందిస్తాన‌ని చెప్పిన సాగునీరు ఇంకా విడుద‌ల చేయ‌క‌పోవ‌డంపై ఆయ‌న‌ను నిల‌దీశారు. ఆయ‌న మాట మీద న‌మ్మ‌కంతో పంట‌లు సాగు చేశామ‌ని, ఇప్పుడు నీరు లేక అవి ఎండిపోతున్నాయ‌ని వాపోయారు. ఎమ్మెల్యే స‌మాధానం చెప్ప‌కపోవ‌డంతో ఆయ‌న‌తో వాగ్వాదానికి దిగారు. సాగునీటిని కూడా ఇవ్వలేని నేతలు ఎందుకంటూ ప్రత్యక్షంగా ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడి నుంచి నిష్క్రమించే ప్రయత్నం చేయగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనం వెనుక పరుగులు తీశారు.

  • Loading...

More Telugu News