India: 5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

  • దక్షిణాఫ్రికా స్కోరు164/5 (48 ఓవ‌ర్ల‌కి)
  • అర్ధ సెంచరీలు చేసిన డివిల్లియర్స్, ఎల్గర్ 
  • ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ (6), ఫిలండర్ (0)

సెంచూరియన్లో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎల్గర్, డివిల్లియర్స్ అర్ధ సెంచరీలు చేసి రాణించారు. అయితే, ఈ జంటను షమీ విడగొట్టాడు. డివిల్లియర్స్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో పార్థివ్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, అనంత‌రం కొద్ది సేప‌టికే ఎల్గర్ 61 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లోనే లోకేశ్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చుకుని వెనుదిరిగాడు. తరువాత క్రీజులోకి వచ్చిన డికాక్ 12 పరుగులకే షమీ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు.

నిన్న దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ లు మార్కమ్ 1, ఆమ్లా 1 పరుగులు చేసి అవుటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ 6, ఫిలండర్ 0 పరుగులతో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా, జస్ప్రిత్ బుమ్రాకి రెండు వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా స్కోరు164/5 (48 ఓవ‌ర్ల‌కి) గా ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335 పరుగులు చేసి ఆలౌట్ కాగా, భారత్ 307 పరుగులకే ఆలౌటైంది. 

More Telugu News