India: అర్జంటుగా వచ్చెయ్... బీసీసీఐ పిలుపుతో విమానమెక్కిన దినేష్ కార్తీక్!

  • ప్రాక్టీసులో సాహా మోకాలికి గాయం
  • రెండో టెస్టుకు దూరం
  • సౌతాఫ్రికా బయలుదేరి వెళ్లిన దినేష్

అర్జంటుగా దక్షిణాప్రికాకు రావాలన్న పిలుపును అందుకున్న వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ దినేష్ కార్తీక్, హుటాహుటిన జొహానస్ బర్గ్ బయలుదేరి వెళ్లాడు. ప్రాక్టీస్ సెషన్ లో కీపర్ సాహా మోకాలికి గాయం కావడంతో, కార్తీక్ కు పిలుపు వచ్చింది. మూడో టెస్టు సమయానికి తను జట్టులోకి చేరుతాడని బీసీసీఐ తెలిపింది. కాగా, సాహా స్థానంలో రెండో టెస్టుకు పార్థివ్ పటేల్ ను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టులోనూ సాహా ఆడేది అనుమానమే కావడంతో కార్తీక్ కు పిలుపు అందింది.

More Telugu News