India: భోజన విరామ సమయానికి 8 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 141 పరుగులతో క్రీజులో కోహ్లీ

  • ద‌క్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో రెండో టెస్టు
  • మొదటి ఇన్నింగ్స్‌లో మరో 48 పరుగులు వెనకబడి ఉన్న భారత్
  • ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు 287/8 (85 ఓవ‌ర్ల‌కి)
  • క్రీజులో కోహ్లీతో పాటు ఇషాంత్ శ‌ర్మ 

ద‌క్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచు మొదటి ఇన్నింగ్స్‌లో శత‌కం బాదిన‌ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనంత‌రం కూడా త‌న జోరుని కొన‌సాగించి మ‌రో 41 ప‌రుగులు చేశాడు. ఇత‌ర బ్యాట్స్ మెన్ ఒక‌రి వెనుక ఒక‌రు పెవిలియన్ కు క్యూ కడుతున్నా కోహ్లీ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మురళీ విజయ్ 46, లోకేశ్ రాహుల్ 10, చటేశ్వర పుజారా 0 (రనౌట్), రోహిత్ శర్మ 10, పార్థివ్ పటేల్ 19, హార్థిక్ పాండ్యా (రనౌట్) 15 ప‌రుగులు చేసిన అవుట‌యిన విష‌యం తెలిసిందే. అనంత‌రం కోహ్లీకి రవిచంద్రన్ అశ్విన్ చ‌క్క‌ని స‌హకారం అందించి 38 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడు.

అశ్విన్ అవుట్ అయ్యాక క్రీజులోకి వ‌చ్చిన ష‌మీ ఒకే ఒక్క‌ ప‌రుగు చేసి వెనుదిరిగాడు. భోజ‌న విరామ స‌మ‌యానికి క్రీజులో కోహ్లీ 141, ఇషాంత్ శ‌ర్మ 0 ప‌రుగుల‌తో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కెల్ రెండు వికెట్లు తీయ‌గా కేశవ్ మహరాజ్, రబాడా, గిడి లకు తలో వికెట్ దక్కాయి. ప్ర‌స్తుతం స్కోరు 287/8 (85 ఓవ‌ర్ల‌కి)గా ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో ద‌క్షిణాఫ్రికా కంటే భార‌త్ మ‌రో 48 ప‌రుగులు వెనక‌బ‌డి ఉంది.

More Telugu News