up shia wakf board chairmen: యూపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కు దావూద్ గ్యాంగ్ వార్నింగ్!

  • వసీం రిజ్వీకి హెచ్చరిక
  • మొత్తం కుటుంబాన్ని హతమారుస్తామంటూ వార్నింగ్
  • పోలీసులకు ఫిర్యాదు

ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ వసీం రిజ్వీతో పాటు అతని కుటుంబాన్ని హతమారుస్తామంటూ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫోన్ ద్వారా ఈ హెచ్చరిక జారీ చేశాడు. ముస్లిం విద్యార్థులను తీవ్రవాదులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న మదర్సాలను మూసివేయాలంటూ ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ లకు యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీ లేఖ రాశారు.

ఈ నేపథ్యంలోనే దావూద్ అనుచరుడు ఈ హెచ్చరికలు జారీ చేశాడు. అయోధ్యలోని రామాలయానికి వసీం రిజ్వీ అనుకూలంగా గతంలో వ్యాఖ్యలు చేశారు. మదర్సాలు టెర్రరిస్టుల తయారీ కేంద్రాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, తనతో పాటు తన కుటుంబాన్ని హతమారుస్తానంటూ ఫోన్ ద్వారా హెచ్చరికలు వచ్చాయని లక్నో పోలీసులకు వసీం రిజ్వీ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News