shabari: ‘మకరజ్యోతి’ దర్శనంతో పరవశించిన అయ్యప్ప భక్తులు

  • దర్శనమిచ్చిన ‘మకరజ్యోతి’
  • పరవశించిపోయిన అయ్యప్పభక్తులు
  • ‘అయ్యప్ప’ నామస్మరణతో భక్తుల తాదాత్మ్యం

కేరళలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమలలో ఈరోజు సాయంకాలం ‘మకరజ్యోతి’ దర్శనమిచ్చింది. ఈ జ్యోతిని దర్శించుకున్న అయ్యప్ప భక్తులు పరవశించిపోయారు. ‘అయ్యప్ప’ నామ స్మరణతో భక్తులు తాదాత్మ్యం చెందారు. ‘మకరజ్యోతి’ మూడుసార్లు దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనం నిమిత్తం వచ్చిన అయ్యప్ప భక్తులతో ఆలయ ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. ఈ సందర్భంగా శబరిమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.

More Telugu News