Chandrababu: నా భార్య భువనేశ్వరి వల్లే ‘హెరిటేజ్’ ఈ స్థాయికి చేరింది: సీఎం చంద్రబాబు

  • చంద్రగిరిలో ‘హెరిటేజ్’ ఫ్యాక్టరీని సందర్శించిన చంద్రబాబు
  • 21 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్లిన బాబు 
  • సామాజిక బాధ్యతతో కష్టపడి పని చేస్తే అవార్డులొస్తాయన్న సీఎం

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ‘హెరిటేజ్’ ఫ్యాక్టరీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు సందర్శించారు. దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఆయన ఈ ఫ్యాక్టరీని సందర్శించడం గమనార్హం. ఈ సందర్భంగా చంద్రబాబునాయడు మాట్లాడుతూ, తన సతీమణి భువనేశ్వరి వల్లే ‘హెరిటేజ్’ ఈరోజు ఈ స్థాయికి చేరిందని ప్రశంసించారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు నడవాలని, సామాజిక బాధ్యతతో కష్టపడి పని చేస్తే అవార్డులు వస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.

అంతకుముందు, ఇంధన పొదుపులో జాతీయ అవార్డుల సాధనకు కృషి చేసిన ‘హెరిటేజ్’ ఉద్యోగులను చంద్రబాబు అభినందించారు. కాగా, సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, హిందూ పురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ తమ కుటుంబాలతో కలిసి నిన్న నారావారిపల్లికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.   

More Telugu News