Bollywood: మ‌హిళా అభిమానితో దురుసుగా ప్రవర్తించిన రిషికపూర్.. కన్నీరు పెట్టుకున్న యువతి!

  • ముంబయిలోని బాంద్రాలో పోష్‌ రెస్టారెంట్ వద్ద ఘటన
  • సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన యువతి
  • ఆమెను తిట్టిన రిషి కపూర్

బాలీవుడ్ న‌టుడు రిషి క‌పూర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ, అభ్యంత‌ర క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తూ త‌రుచూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. గ‌తంలో ఓ సారి పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్థాన్‌దే అంటూ వ్యాఖ్య‌లు చేసిన రిషి క‌పూర్‌.. మ‌రో సారి జర్నలిస్ట్‌లపై నోరు జారి వార్త‌ల్లో నిలిచాడు. తాజాగా, ఓ మ‌హిళా అభిమానితో ఆయ‌న‌ దు‌రుసుగా ప్ర‌వ‌ర్తించడంతో ఆమె క‌న్నీరు పెట్టుకుంది. రిషి క‌పూర్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ముంబయిలోని బాంద్రాలో పోష్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్క‌డి ఓ మ‌హిళా అభిమాని త‌న‌తో ఫోటో తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నించడ‌ంతో ఆయన దురుసు‌గా ప్రవర్తిస్తూ, ఆమెను తిట్టారు. ఆ స‌మ‌యంలో రిషి క‌పూర్ త‌న‌యుడు ర‌ణ్‌బీర్ క‌పూర్ కూడా అక్క‌డే ఉన్నాడు.            

More Telugu News