Apcc president: అందుకే, మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు: రఘువీరారెడ్డి

  • మోదీని క‌ల‌వ‌డంలో అస‌లు ఉద్దేశం రాష్ట్రాభివృద్ధి కాదు
  • అసెంబ్లీ సీట్ల పెంపు కోసమే కలిశారు
  • చంద్ర‌బాబుకు రాష్ట్రాభివృద్ధికంటే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌ం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ ఏ హామీ ఇచ్చారో చెప్పాల‌ని ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి ప్ర‌శ్నించారు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందు ప‌ర్చిన అంశాల‌ను అమ‌లు చేస్తామని చెబుతూ ప్ర‌జ‌ల‌ను ఇంకా ఎంత కాలం మోసం చేస్తార‌ని నిల‌దీశారు. ఈ మేర‌కు విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ప్రెస్ నోట్ విడుద‌ల చేశారు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌ర్చిన అంశాల‌ను అమ‌లు చేయాల‌ని ఢిల్లీలో మోదీని చంద్ర‌బాబు కోరడం విడ్డూరంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌ధాన‌మంత్రిని చంద్ర‌బాబు క‌ల‌వ‌డంలో అస‌లు ఉద్దేశం రాష్ట్రాభివృద్ధి కాద‌ని, అసెంబ్లీ సీట్ల పెంపు కోసమే కలిశారని ఆరోపించారు. చంద్ర‌బాబుకు రాష్ట్రాభివృద్ధికంటే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని తెలిపారు.  

More Telugu News