vijay: త్రివిక్రమ్ కంటే ముందే గౌతమ్ మీనన్ ఈ కథను విజయ్ తో చేద్దామనుకున్నాడట!

  • కొన్నేళ్ల క్రితమే 'లార్గోవించ్' పై గౌతమ్ మీనన్ దృష్టి 
  • హీరోగా విజయ్ ఫస్టులుక్ వదిలారు 
  • ఆ తరువాతే ఆగిపోయింది     

పవన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అజ్ఞాతవాసి' సినిమా .. ఫ్రెంచి మూవీ 'లార్గోవించ్'కి కాపీ అనే విషయం బయటికి వచ్చేసింది. మరి త్రివిక్రమ్ కంటే ముందుగా ఈ కథ ఎవరి దృష్టిలోకి వెళ్లలేదా? అంటే .. వెళ్లిందనే అంటున్నారు. ఎవరయ్యా ఆ దర్శకుడు అంటే .. గౌతమ్ మీనన్ పేరు వినిపిస్తోంది.

కొన్నేళ్ల క్రిందటే ఈ కథను తమిళంలో తెరకెక్కించడానికి గౌతమ్ మీనన్ ప్రయత్నించారని సమాచారం. ఈ ఫ్రెంచ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను విజయ్ తో రీమేక్ చేయడానికి గౌతమ్ మీనన్ సన్నాహాలు చేశాడట. స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకుని .. ఈ సినిమాకి 'యోహన్ అధ్యాయం ఒండ్రు' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు కూడా. ఈ టైటిల్ తో విజయ్ ఫస్టులుక్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే కారణమేమిటనే విషయం తెలియదు గానీ, ఈ సినిమా అంతటితోనే ఆగిపోయింది. త్రివిక్రమ్ మాత్రం కాస్త ఆలస్యమైనా పవన్ తో ఈ సినిమాను బయటికి తీసుకువచ్చేశాడు.  

More Telugu News