venkatesh: 'గురూ గారూ వద్దు, గురు చాలు' అన్న వెంకటేశ్.. పగలబడి నవ్విన పవన్ కల్యాణ్.. వీడియో మీరూ చూడండి!

  • వెంక‌టేశ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య  అజ్ఞాతవాసిలో సీన్లు
  • కొన్ని రోజుల్లో అజ్ఞాతవాసిలో కనపడనున్న వెంకీ 
  • డబ్బింగ్ చెబుతుండగా తీసిన వీడియో విడుదల 
  • పక్కపక్కనే కూర్చుని డైలాగులు చెప్పిన వెంకీ, పవన్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అజ్ఞాత‌వాసి సినిమాలో విక్ట‌రీ వెంక‌టేశ్ కూడా న‌టించిన విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల్లో వెంక‌టేశ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య తీసిన సీన్ల‌ను ఈ సినిమాలో క‌ల‌ప‌నున్నారు. ఈ సినిమా కోసం వెంక‌టేశ్, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు చెప్పిన డ‌బ్బింగ్‌ను హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ త‌మ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.

విక్ట‌రీ వెంక‌టేశ్ ప‌క్క‌న ప‌వ‌న్ కల్యాణ్ కూర్చొని హుషారుగా డైలాగులు చెప్పారు.. విర‌గ‌బ‌డి నవ్వారు. 'గురు గారూ.. గురూ గారు' అని ప‌వ‌న్ అన‌గా, 'గారు అక్క‌ర్లేద‌మ్మా.. గురు చాలు..' అని వెంక‌టేశ్ డైలాగ్ కొడ‌తాడు. 'నాక్కొంచం తిక్కుంది' అని ప‌వ‌న్ అన‌గా, 'దానికో లెక్కుంది' అని, 'అదీ.. అదీ డైలాగు' అని వెంక‌టేశ్ అన్నారు. మీరూ చూడండి...

More Telugu News