deepak reddy: టీడీపీ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చంద్రబాబు సభలో ప్రత్యక్షం!

  • జన్మభూమి కార్యక్రమానికి హాజరు
  • దివాకర్ రెడ్డితో కలసి రాక
  • వేదికపై కూర్చున్న దీపక్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండైన టీడీపీ నేత చంద్రబాబు సభలో ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జన్మభూమి-మా ఊరు ముగింపు సభకు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హాజరయ్యారు.

తన మామ దివాకర్ రెడ్డితో కలసి ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. అంతేకాదు, వేదికపై ఆసీనులయ్యారు. హైదరాబాద్ భూకబ్జా కేసు నేపథ్యంలో, ఆయనను గత ఏడాది జూన్ లో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, సీఎం సభకు ఆయన హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.

More Telugu News