narasimhan: కొత్త గవర్నర్‌ను నియమించాలి: బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు

  • బ‌డ్జెట్ స‌మావేశాల్లోగా ప్రక్రియ పూర్తి కావాలి
  • గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఏనాడూ రాష్ట్ర  బాగోగుల‌ను ప‌ట్టించుకోలేదు
  • చుట్ట‌పుచూపుగా రాష్ట్రానికి వ‌చ్చి పోతున్నారు
  • రాష్ట్రంలో నివాసానికి అనువైన వ‌స‌తులు లేవ‌ని రాలేక‌పోతున్నారా?

ప్ర‌స్తుత గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను తొల‌గించి, బ‌డ్జెట్ స‌మావేశాల్లోగా కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో ఆయ‌న మాట్లాడుతూ... గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఏపీ బాగోగుల‌ను ప‌ట్టించుకోలేదని మండిప‌డ్డారు. చుట్ట‌పుచూపుగా రాష్ట్రానికి వ‌చ్చి వెళుతున్నార‌ని, గ‌వ‌ర్న‌ర్ వ‌ల్ల ఏపీకి ప్ర‌యోజనం లేదని చెప్పారు. రాష్ట్రంలో నివాసానికి అనువైన వ‌స‌తులు లేవ‌ని రాలేక‌పోతున్నారా? అని ఎద్దేవా చేశారు. గవర్నర్ ఏ రోజైనా కుటుంబ పెద్దలా వ్యవహరించారా? క‌నీసం వారం రోజులైనా ఏపీలో ఉన్నారా? అని ఆయన ప్ర‌శ్నించారు. నాలా బిల్లును ఆరు నెలలుగా పెండింగ్ పెట్టారని విమ‌ర్శించారు.   

  • Loading...

More Telugu News