Ramcharan: ఓ సన్నివేశంలో కమెడియన్ మహేశ్ ఎన్నో టేక్స్ తీసుకున్నాడు: హీరో రామ్ చరణ్

  • ‘రంగస్థలం’ చిత్ర యూనిట్ నిన్న సుదీర్ఘంగా పని చేసింది
  • ఓ సన్నివేశానికి మహేశ్ ఎన్నో టేక్స్ తీసుకున్నాడు
  • ఓ వీడియో పోస్ట్ చేసిన రామ్ చరణ్

‘రంగస్థలం’లో ఓ సన్నివేశానికి సంబంధించి కమెడియన్ మహేశ్ టేక్ ల మీద టేక్ లు తినేశాడంటూ హీరో రామ్ చరణ్ అన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘చిత్ర యూనిట్ నిన్న సుదీర్ఘంగా పని చేసింది. ఈ రోజు రాత్రి మహేశ్ పై చిత్రీకరించిన ఓ సన్నివేశానికి ఎన్నో టేక్స్ తీసుకున్నాడు. దీంతో, చిత్ర యూనిట్ అంతా అక్కడే ఉండిపోయాం’ అంటూ హాస్యనటుడు మహేశ్ పై చిత్రీకరించిన సన్నివేశపు వీడియోను చెర్రీ పోస్ట్ చేశాడు. కాగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది.

More Telugu News