rajasthan: రాజ‌స్థాన్‌లో 'ప‌ద్మావ‌త్' విడుద‌ల కాదు: సీఎం వ‌సుంధ‌ర రాజే

  • ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తీసే ప‌నులు మేం చేయ‌లేం
  • ఎలాగైనా విడుద‌ల‌ను అడ్డుకుంటామ‌న్న రాజ్‌పుత్‌లు
  • పెట్రోల్ పోసుకుని నిర‌స‌న తెలిపేందుకు ప్ర‌ణాళిక‌లు

సంజ‌య్ లీలా భ‌న్సాలీ 'ప‌ద్మావ‌తి' సినిమా పేరును 'ప‌ద్మావ‌త్‌'గా మార్చి జ‌న‌వ‌రి 25న విడుద‌లకు సిద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సీబీఎఫ్‌సీ అనుమ‌తిచ్చిన‌ప్ప‌టికీ రాజ‌స్థాన్ రాజ్‌పుత్ వ‌ర్గాలు మాత్రం ఇంకా రగులుతూనే ఉన్నాయి. వారిని దృష్టిలో పెట్టుకుని రాజ‌స్థాన్‌లో ప‌ద్మావ‌త్ సినిమా విడుద‌ల కాబోద‌ని సీఎం వ‌సుంధ‌ర రాజే ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే ప‌నుల‌ను తాము చేయ‌లేమ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

అలాగే సినిమా విడుద‌ల‌ను ఎలాగైనా అడ్డుకుంటామని రాజ్‌పుత్ సేన‌లు ప్ర‌క‌టించాయి. సినిమా విడుద‌ల‌కు అంగీక‌రించి సీబీఎఫ్‌సీ త‌ప్పు చేసింద‌ని, దేశం దావాన‌లంలా మార‌డానికి పునాదులు వేసింద‌ని హెచ్చ‌రించాయి. ఇదిలా ఉంచితే, థియేట‌ర్ల ముందు పెట్రోల్ పోసుకుని నిర‌స‌న‌లు తెలిపేందుకు రాజ్‌పుత్, క‌ర్ని సేన‌లు ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News