jai simha: ‘జై సింహా’ ప్రీ రిలీజ్ వేడుక.. ట్రయిలర్ విడుదల!

  • హైదరాబాద్ లో ‘జై సింహా’ ప్రీ రిలీజ్ వేడుక
  • ఈ కార్యక్రమానికి హాజరైన చిత్రయూనిట్, సినీ ప్రముఖులు
  • అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా, సింహం ఒక్కటే: బ్రహ్మానందం

నందమూరి బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ ప్రీ రిలీజ్ వేడుక ఈ సాయంకాలం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ట్రయిలర్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, నిర్మాత సి.కల్యాణ్, చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్, దర్శకులు బోయపాటి శ్రీను, వి.వి.వినాయక్, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా, సింహం ఒక్కటే ఉంటుందని అన్నారు. బాలయ్య మరిన్ని సినిమాలు తీస్తూ ముందుకు వెళ్లాలని, ఆయన సినిమాల ద్వారా అన్ని క్రాఫ్ట్స్ కు చెందిన వారు పదికాలాల పాటు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.



  • Loading...

More Telugu News