India: బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యం.. పరాజయం పాలైన టీమిండియా!

  • చేతులెత్తేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్ 
  • ద‌క్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ 286 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 130
  • టీమిండియా మొదటి ఇన్నింగ్స్ 209 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 135
  • 72 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం

దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న తొలిటెస్టులో టీమిండియా ఓట‌మి పాల‌యింది. టీమిండియా బౌల‌ర్లు అద్భుతంగా రాణించిన‌ప్ప‌టికీ బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం రాణించ‌లేక‌పోవ‌డంతో.. ద‌క్షిణాఫ్రికా విజ‌య దుందుభి మోగించింది. మొదటి ఇన్నింగ్స్ లో ద‌క్షిణాఫ్రికా 286 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులు చేసిన విష‌యం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 209 పరుగులు చేసిన నేపథ్యంలో విజయానికి 208 పరుగులు మాత్ర‌మే చేయాల్సి ఉండ‌గా ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల ధాటికి వ‌రుస‌గా భార‌త బ్యాట్స్‌మెన్ ఔట‌య్యారు.

భార‌త బ్యాట్స్‌మెన్‌లో మురళీ విజయ్ 13, శిఖర్ ధావన్ 16, పుజారా 4, విరాట్ కోహ్లీ 28, రోహిత్ శర్మ 10, వృద్ధిమాన్ సాహా 8, హార్దిక్ పాండ్యా 1, రవి చంద్రన్ అశ్విన్ 37, భువనేశ్వర్ కుమార్ 13 (నాటౌట్) , షమీ 4, బుమ్రా 0 పరుగులు మాత్రమే చేశారు. దీంతో టీమిండియా 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలండర్ 6 వికెట్లు తీయగా, మార్కెల్, రబడా రెండేసి వికెట్లు తీశారు.

More Telugu News