mahatma gandhi: మహాత్మాగాంధీ హత్య కేసులో పునర్విచారణ అవసరం లేదు.. సుప్రీంకోర్టుకు అడ్వకేట్ అమరేందర్ శరణ్ నివేదిక!

  • నాలుగో బుల్లెట్ ఉందంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని వ్యాఖ్య‌
  • విదేశీ నిఘా సంస్థ‌ల ప్ర‌మేయం లేద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • సుప్రీంకోర్టుకి నివేదిక అంద‌జేసిన అమ‌రేందర్ శ‌ర‌ణ్‌

మహాత్మాగాంధీ హత్య కేసులో పునర్విచారణ అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేస్తూ సుప్రీంకోర్టు అమికస్‌ క్యూరీ (కోర్టు సహాయకుడు)గా సీనియర్‌ అడ్వొకేట్‌ అమరేందర్‌ శరణ్ సుప్రీంకోర్టుకు త‌న నివేదిక‌ను స‌మ‌ర్పించారు. గాంధీ హ‌త్య‌కి సంబంధించిన అనుమానాల‌ను, ఆరోప‌ణ‌ల‌ను ఈ నివేదిక ద్వారా ఆయ‌న ఖండించారు. మహాత్మాగాంధీని గాడ్సేనే హతమార్చాడని.. ఇందులో విదేశీ నిఘా సంస్థల వ్యక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

నేషనల్‌ అర్కైవ్స్‌ నుంచి అవసరమైన పత్రాలు, నివేదిక క్షణ్ణంగా పరిశీలించాకే ఈ నివేదికను రూపొందించినట్లు అమరేందర్‌ వెల్లడించారు. నాలుగో బుల్లెట్‌ గాంధీ ప్రాణం తీసిందన్న ఆరోప‌ణ‌ను కూడా ఆయ‌న తోసిపుచ్చారు. గాంధీ హ‌త్య కేసు విష‌య‌మై పున‌ర్విచార‌ణ కోరుతూ ముంబైకి చెందిన పరిశోధకుడు, అభినవ్‌ భారత్‌ సంస్థ ట్రస్టీ పంకజ్‌ ఫడ్నవీస్‌ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే గాంధీ హ‌త్య విష‌యంలో జోక్యం చేసుకొనే హక్కు పంకజ్‌కు లేదంటూ గాంధీ మునిమ‌న‌వ‌డు తుషార్ వాదించారు. దీంతో ఈ కేసు గురించి పూర్తి వివ‌రాల కోసం సుప్రీంకోర్టు, అమ‌రేంద‌ర్ శ‌ర‌ణ్ స‌హాయం కోరింది.

  • Loading...

More Telugu News