హీరోగా ఆది పినిశెట్టి మూవీకి ముహూర్తం ఖరారు
- మళ్లీ హీరోగా ఆది పినిశెట్టి
- హీరోయిన్స్ గా తాప్సీ .. రితికా సింగ్
- ఈ నెల 10 నుంచి షూటింగ్
'గీతాంజలి' నిర్మాతలతో కలిసి కోన వెంకట్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హరనాథ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఆది పినిశెట్టి సరసన కథానాయికలుగా, తాప్సీ .. రితికా సింగ్ నటించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో ఆది పినిశెట్టి హీరోగానూ మళ్లీ బిజీ అవుతాడేమో చూడాలి.