raviteja: 'టచ్ చేసి చూడు' టీజర్ రిలీజ్ .. పవర్ఫుల్ పాత్రలో రవితేజ

  • రవితేజ తాజా చిత్రంగా 'టచ్ చేసి చూడు'
  • కథానాయికలుగా రాశిఖన్నా .. శీరత్ కపూర్
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన  

రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' సినిమా తెరకెక్కింది. నల్లమలుపు బుజ్జి నిర్మించిన ఈ సినిమాలో, రాశిఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్ పై కట్ చేసిన ఈ టీజర్, రవితేజ అభిమానులను ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిగా వుంది.

'టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. హీరోలో ఎంత పవర్ వున్నది' అనే ఉద్దేశంతోనే ఈ సినిమాకి 'టచ్ చేసి చూడు' అనే టైటిల్ ను సెట్ చేశారు. ఈ టీజర్ ను చూస్తుంటే .. రవితేజ రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉందనేది అర్థమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు. అది ఎంతవరకూ సాధ్యమవుతుందనేది చూడాలి మరి.

More Telugu News