jamia nizamia: రొయ్యలు తినడంపై ఫత్వా జారీ చేసిన ముస్లిం మత పెద్ద

  • రొయ్యలు చేపలు కావు
  • అవి కీటకాలు
  • ముస్లింలు ఎవరూ రొయ్యలు తినరాదు

ముస్లింలు ఎవరూ రొయ్యలు తినరాదంటూ జామియా నిజామియా చీఫ్ ముఫ్తీ మహమ్మద్ అజీముద్దీన్ ఫత్వా జారీ చేశారు. రొయ్యలు చేపల కిందకు రావని, అవి కీటకాల జాతికి చెందినవని జామియా నిజామియా ప్రకటించింది. రొయ్యలు తినడం అత్యంత హేయమైన చర్య అంటూ అజీముద్దీన్ పేర్కొన్నారు. దాదాపు 142 ఏళ్ల చరిత్ర ఉన్న ఇస్లామిక్ యూనివర్శిటీ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అజీముద్దీన్ ఫత్వా పట్ల కొందరు ముస్లిం పెద్దలు కూడా విభేదిస్తున్నారు.

More Telugu News