allu sirish: 'ఒక్క క్షణం' అల్లు శిరీష్ ను నిరాశ పరిచినట్టే!

  • కొత్త కంటెంట్ తో వచ్చిన 'ఒక్క క్షణం'
  • ఆశించిన స్థాయిలో లేని వసూళ్లు 
  • థియేటర్స్ కి వచ్చిన సమయం సరైనది కాదనే అభిప్రాయాలు  

అల్లు శిరీష్ తాజా చిత్రంగా 'ఒక్క క్షణం' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కంటెంట్ తో దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఆడియన్స్ ను పలకరించాడు. సురభి కథానాయికగా నటించిన ఈ సినిమాకి, ఒక రేంజ్ లో ప్రమోషన్స్ ను నిర్వహించారు కూడా. వి.ఐ.ఆనంద్ గతంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చేయడం వలన, ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేదని తెలుస్తోంది.

ఇంతకుముందు అల్లు శిరీష్ చేసిన 'కొత్తజంట' మొదటివారంలో 6 కోట్లను వసూలు చేస్తే, 'శ్రీరస్తు శుభమస్తు' 9 కోట్లను వసూలు చేసింది. 'ఒక్క క్షణం' ఆ వసూళ్లను అధిగమిస్తుందని అనుకున్నారు గానీ అలా జరగలేదు. మొదటివారంలో ఈ సినిమా 2.95 కోట్లను మాత్రమే రాబట్టిందని అంటున్నారు. థియేటర్స్ లో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' .. 'హలో' ఉండగా రావడమే ఈ సినిమా వసూళ్లు తగ్గడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

More Telugu News