Chiranjeevi: చిరంజీవి, మోహన్ బాబు, రాజశేఖర్... కలసి విందుకు హాజరైన వేళ!

  • ఒకే పార్టీకి హాజరైన తారలు
  • సుబ్బరామిరెడ్డి, అశ్వనీదత్ కూడా
  • సోషల్ మీడియాలో వైరల్

మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, హీరో రాజశేఖర్ కలసి ఓ విందుకు హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన పార్టీకి వీరితో పాటు మాజీ ఎంపీ టీ సుబ్బరామిరెడ్డి, నిర్మాత అశ్వనీదత్ తదితరులు కూడా హాజరయ్యారు. సుబ్బరామిరెడ్డికి చెందిన హోటల్ లోనే ఈ పార్టీ జరుగగా, పలువురు సినీ సెలబ్రిటీలు, పేజ్-3 ప్రముఖులు హాజరయ్యారు. ఇక్కడ వీరు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరూ చూడవచ్చు.

More Telugu News