israel: మోదీ కోసం ఇజ్రాయెల్ ప్ర‌ధాని అరుదైన కానుక‌!

  • కొన్ని నెల‌ల క్రితం ఇజ్రాయెల్‌లో మోదీ ప‌ర్య‌ట‌న‌
  • సముద్ర తీరంలో ఇజ్రాయెల్ ప్ర‌ధానితో బగ్గీ జీపులో మోదీ ప్ర‌యాణం
  • ఈ నెల 14న‌ ఆ జీపునే తీసుకురానున్న బెంజిమిన్‌ నెతన్యహూ
  • ఆ జీపు ధర దాదాపు రూ.70 లక్ష‌లు

కొన్ని నెల‌ల క్రితం భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఆ సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యహూతో క‌లిసి మోదీ సముద్ర తీరంలో బగ్గీ జీపులో ప్రయాణించారు. కాగా, నెతన్యహూ ఈ నెల 14న భారత్‌కు రానున్నారు. మోదీ కోసం ఆయన ఆ జీపును తీసుకొస్తున్నారు.

ఆ జీపు ధర 3,90,000 షెకెల్స్ ( దాదాపు రూ.70 లక్షలకు పైగా) ఉంటుంది. ఆ జీపుకి రోజుకు 20 వేల లీటర్ల సముద్రపు నీటిని తాగునీరుగా శుద్ధి చేసే ప్రత్యేకత ఉంది. అదే అపరిశుభ్ర నదీ జలాలనైతే రోజుకు 80వేల లీటర్ల వరకు శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. వరదలు వచ్చినప్పుడు తాగునీటి కోసం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 

More Telugu News