లాలూ ప్రసాద్ యాదవ్కి శిక్ష ఖరారు వాయిదా!
- దాణా కుంభకోణం కేసులో ఇటీవల దోషిగా తేలిన లాలూ
- శిక్షను ఈ రోజు ఖరారు చేస్తామన్న కోర్టు
- రేపటికి వాయిదా వేసిన రాంచీ సీబీఐ కోర్టు
దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలు ప్రసాద్ యాదవ్తో పాటు మరో 15 మందిని గత నెల 23న దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. 1990-94 మధ్య కాలంలో దియోగర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ నుంచి రూ. 84.5 లక్షల నిధులను పక్కదారి పట్టించిన కేసులో వీరంతా దోషులుగా తేలారు. ఈ కేసులో లాలు ప్రసాద్ యాదవ్కి ఏడు సంవత్సరాల శిక్షను విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.