kishan reddy: గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌పై ఇప్ప‌టికే కేంద్ర స‌ర్కారుకి ఫిర్యాదు.. మ‌ళ్లీ చేస్తాం: కిష‌న్ రెడ్డి

  • టీఆర్ఎస్ స‌ర్కారు మంద కృష్ణ మాదిగ‌పై క‌క్ష క‌ట్టింది
  • మ‌రోసారి జైలుకి పంపింది
  • రాష్ట్రంలో జ‌రుగుతోన్న ప‌రిణామాల‌పై గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవ‌డం లేదు  

శాంతియుతంగా నిర‌స‌న‌కు దిగిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రోసారి జైలుకి పంపింద‌ని బీజేపీ ఎమ్మెల్యే కిష‌న్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ‌లో అస‌లు ప్రజాస్వామ్యం ఉందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

 ఈ రోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ స‌ర్కారు మంద కృష్ణ మాదిగ‌పై క‌క్ష క‌ట్టింద‌ని ఆరోపించారు. అందుకే ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతోన్న ప‌రిణామాల‌పై గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ జోక్యం చేసుకోవ‌డం లేద‌ని అన్నారు. గ‌వ‌ర్న‌ర్‌పై ఇప్ప‌టికే తాము కేంద్ర స‌ర్కారుకి ఫిర్యాదు చేశామ‌ని, మ‌ళ్లీ ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు.

More Telugu News