nani: కిషోర్ తిరుమలతో సెట్స్ పైకి నాని!

  • 'కృష్ణార్జున యుద్ధం' చేస్తోన్న నాని 
  • ఆయన నిర్మాణంలో 'అ' సినిమా 
  • మార్చి 2వ వారంలో కొత్త సినిమా మొదలు

నాని ఈ ఏడాది కూడా హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కథల ఎంపికలో తనకి తిరుగులేదనే విషయాన్ని మరోమారు నిరూపించుకున్నాడు. ఒక వైపున మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' చేస్తూనే, మరో వైపున 'అ' సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా దాదాపు ముగింపు దశకి చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో నాని మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.. ఆ దర్శకుడి పేరే కిషోర్ తిరుమల. 'నేను శైలజ'తో రామ్ కి హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు, ఆ తరువాత 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాతో రామ్ కి ప్లాప్ ఇచ్చాడు. ఆయన వినిపించిన కథపై .. ఆయన టేకింగ్ పై గల నమ్మకంతో నాని ఓకే చెప్పేశాడట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్, మార్చి 2వ వారంలో ప్రారంభం కానున్నట్టు చెబుతున్నారు. నాని ఓకే చేశాడంటే కథలో విషయం ఉండే వుంటుందనే విషయం వేరే చెప్పాలా?     

More Telugu News