rajananikanth: మలేసియాకి మారిపోయిన '2.0' టీజర్ రిలీజ్ వేడుక

  • మలేసియాలో కోలీవుడ్ స్టార్ నైట్ 
  • అదే వేదికపై టీజర్ ఆవిష్కరణ 
  • చెన్నైలో ట్రైలర్ లాంచ్ చేయాలనే ఆలోచన 
  • ఏప్రిల్ 14న సినిమా రిలీజ్

భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో '2.0' చిత్రం తెరకెక్కింది. రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ .. ఎమీ జాక్సన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల 'దుబాయ్'లో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఒక రేంజ్ లో నిర్వహించారు. ఆ తరువాత టీజర్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తామని చెప్పారు. కానీ ఆ ఆలోచనను విరమించుకున్నారనేది తాజా సమాచారం.

ఈ టీజర్ ను మలేసియాలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. మలేసియాలో తమిళులు ఎక్కువగా ఉండటం వలన, ప్లాన్ అక్కడికి మారిపోయిందని అంటున్నారు. ఈ నెల 6వ తేదీన అక్కడ 'కోలీవుడ్ స్టార్ నైట్' ను నిర్వహించి, ఆ వేదికపై టీజర్ ను రిలీజ్ చేస్తారట. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని ట్రైలర్ ను చెన్నైలో విడుదల చేయనున్నారు. తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని, ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

  • Loading...

More Telugu News