tollywood: ఆ దర్శకురాలిని చెప్పుతో కొట్టాలనిపించింది: సినీ మహిళా గీత రచయిత శ్రేష్ఠ

  • టాలీవుడ్ లో మరో కోణం
  • కొత్తగా వచ్చిన మహిళలపై మహిళల వేధింపులు
  • బయటపెట్టిన పాటల రచయిత్రి శ్రేష్ఠ

సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపుల గురించి ఇప్పటికే అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. తాము కూడా వేధింపులకు లోనయ్యామంటూ పలువురు హీరోయిన్లు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో 'అర్జున్ రెడ్డి', 'పెళ్లిచూపులు' సినిమాలకు పాటలు రాసి, పాప్యులర్ అయిన మహిళా గేయ రచయిత శ్రేష్ఠ కూడా చేరారు. తాను కూడా పరిశ్రమలో వేధింపులకు గురయ్యానని ఆమె తెలిపారు.

గోవాలో జరిగిన ఓ పార్టీకి రావాలంటూ తనను ఓ దర్శకురాలు బలవంతం చేసిందని... అక్కడ తనకు ఓ వ్యక్తిని పరిచయం చేసి, నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పిందని శ్రేష్ఠ అన్నారు. అయితే, అదే వ్యక్తి తనకు ఫోన్ చేసి సదరు దర్శకురాలు నీ గురించి మరోలా చెప్పిందంటూ చీప్ గా మాట్లాడాడని... ఆ ఘటనతో తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. ఆ దర్శకురాలిని చెప్పుతో కొట్టాలని తనకు అనిపించిందని అన్నారు. సినీ పరిశ్రమకు కొత్తగా వచ్చినవారిని వేధింపులకు గురి చేసే వారిలో మహిళలు కూడా ఉన్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News