YS Viveka: వైఎస్ వివేకా పీఏనంటూ.. గుంటూరు యువతిని మోసం చేసిన చార్లెస్!

  • అమ్మాయిలను దారుణంగా మోసం చేసే చార్లెస్ సంపత్ కిరణ్
  • ఇప్పటికే మూడు వివాహాలు, నాలుగో పెళ్లికి రెడీ
  • బాధితురాలి అనుమానంతో బండారం బట్టబయలు

తాను వైఎస్ వివేకానందరెడ్డి పీఏనంటూ.. గుంటూరుకు చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్న చార్లెస్ సంపత్ కిరణ్, ఆమెను ప్రేమ, పెళ్లి పేరిట దారుణంగా మోసం చేశాడు. క్రిస్టియన్ మ్యారేజ్ బ్యూరోల ద్వారా పెళ్లిళ్లు చేసుకుంటానని అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఈ చార్లెస్, ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని, వారిని వదిలేసి ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధం  అయ్యాడు. బాధితురాలికి వచ్చిన అనుమానం ఈ దుర్మార్గుడి బండారాన్ని బట్టబయలు చేసింది.

కాగా, వైఎస్ వివేకానందరెడ్డి పీఏనంటూ, ఏలూరుకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్న చార్లెస్, కట్నంగా రూ. 15 లక్షలు కూడా తీసుకున్నాడు. ఇక్కడ మాత్రం తనకు గతంలోనే పెళ్లయిందని, హైదరాబాద్ లో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చెప్పి, ఏలూరులోనే బాధితురాలిని ఉంచాడు. ఆమె దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి అటువైపు కూడా చూడలేదు. తాను మోసపోయానని తెలిసి ఈ బాధితురాలు కూడా పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి గత నెలలోనే అరెస్ట్ చేయగా, తనకున్న పరపతితో బయటకు వచ్చాడు.

ఆపై ఆమెను హత్య చేస్తానని బెదిరించాడు. ఇప్పుడు ఇద్దరు బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు రావడం, పైగా మహిళా కమిషన్ కూడా దృష్టిని సారించడంతో చార్లెస్ కథను తేల్చేందుకు పోలీసులు కదిలారు. ఇదిలావుండగా, చార్లెస్ నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి పీఏనా? కాదా? అన్న విషయం తేలాల్సివుంది. 

More Telugu News