Telangana: ప్రతిష్ఠాత్మక సీబీఐపీ అవార్డును అందుకున్న తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ

  • విద్యుత్ సరఫరా రంగంలో విశేష కృషికి దక్కిన అవార్డు
  • ఢిల్లీలో అవార్డును అందుకున్న సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రులు, సీబీఐపీ అధ్యక్షుడు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) ప్రతిష్ఠాత్మక అవార్డును తెలంగాణ ట్రాన్స్ కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు అందుకున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన స్వీకరించారు. కేంద్ర మంత్రుల సమక్షంలో సీబీఐపీ అధ్యక్షుడు రవీంద్రకుమార్ వర్మ ఈ అవార్డును ఆయనకు అందజేశారు. విద్యుత్ సరఫరా రంగంలో విశేష కృషి చేసి దేశంలోనే తెలంగాణ ట్రాన్స్ కోను పలు రంగాల్లో అగ్రగామిగా నిలిపినందుకే ఈ అవార్డును ఆయనకు అందజేసినట్టు సీబీఐపీ పేర్కొంది.

More Telugu News