Jagan: జగన్ కు తిలకం దిద్ది, హారతి ఇచ్చిన రోజా.. ఫొటోలు చూడండి!

  • 51వ రోజుకు చేరిన జగన్ పాదయాత్ర
  • చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
  • జగన్ కు హారతిచ్చిన రోజా

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర 51వ రోజుకు చేరుకుంది. ఈ ఉదయం చిత్తూరు జిల్లా జమ్మిలవారిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. చింతపర్తి, పాతకోటపల్లి, బీదవారిపల్లి, గండబోయనపల్లి, డెకలకొండ మీదుగా కలికిరి వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా పాదయాత్రకు వైసీపీ ఎమ్మెల్యే రోజా జతకలిశారు. చింతపర్తిలో జగన్ నుదుటన తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను రోజా తన ఫేస్ బుక్ అకౌంట్ లో అప్ లోడ్ చేశారు

More Telugu News