sc st commision: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • ఫైలుపై కేసీఆర్ సంతకం
  • చైర్మన్‌గా సిద్ధిపేటకు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్
  • సభ్యులుగా మరో ఐదుగురి నియామకం

తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇందుకు సంబంధించిన ఫైలుపై ఈ రోజు సంతకం చేశారు. వీటికి సంయుక్త చైర్మన్ గా సిద్ధిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ నియమితులయ్యారు. సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ ( రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం, రాయగూడ), సుంకపాక దేవయ్య ( హైదరాబాద్ నగరంలోని రాంనగర్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల)లను నియమించారు.     

More Telugu News