new year: న్యూ ఇయర్ వేడుకల‌కు వెళ్తూ.. మృత్యు ఒడికి చేరుకున్న 12 మంది

  • కోస్టారికాలోని శాన్‌‌జోస్‌లో విమాన ప్ర‌మాదం
  • మృతుల్లో 10 మంది అమెరికా వాసులు
  • ఇద్దరు కోస్టారికాకు చెందినవారు

న్యూ ఇయర్ నేపథ్యంలో స‌ర‌దాగా గడిపి, పార్టీ చేసుకోవ‌డానికి కోస్టారికాలోని శాన్‌‌జోస్‌ ప‌రిస‌ర ప్రాంతాల‌కు వెళుతుండ‌గా విమాన ప్ర‌మాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. గునాక్యాస్ట్ ప్రాంతంలోని ఓ కొండ ప్రాంతంలో విమానం కుప్ప‌కూలింద‌ని అక్క‌డి అధికారులు చెప్పారు. ఆ విమానం ప్రైవేట్ విమానయాన సంస్థ ‘నేచర్ ఎయిర్ చార్టర్‌’కు చెందింద‌ని తెలిపారు. మృతుల్లో పది మంది అమెరికా వాసులు, మరో ఇద్దరు కోస్టారికాకు చెందినవారు ఉన్నార‌ని తెలిపారు. 

More Telugu News