prabhas: ప్రభాస్ హీరోగా 'దందా' .. దర్శక నిర్మాతగా కృష్ణంరాజు!

  • 'సాహో' సినిమా పనుల్లో ప్రభాస్ 
  • తదుపరి సినిమా రాధాకృష్ణతో 
  • ఆ తరువాత ప్రాజెక్టు కృష్ణంరాజుతో

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. త్వరలో మొదలు కానున్న మేజర్ షెడ్యూల్ కోసం ఆయన గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే కృష్ణంరాజు సొంత బ్యానర్లో ఒక సినిమా చేయనున్నాడని చెప్పుకున్నారు.

 రాధాకృష్ణ తో 2018 చివరిలో గానీ, 2019 ప్రారంభంలో గాని ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. ఆ తరువాత కృష్ణంరాజు సొంత సినిమా మొదలవుతుందని అంటున్నారు. ఈ సినిమాకి దర్శక నిర్మాతగా కృష్ణంరాజు వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. రీసెంట్ గా కృష్ణంరాజు 'దందా' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. దాంతో ఆ టైటిల్ ప్రభాస్ తో సినిమా కోసమేననే టాక్ ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. 

  • Loading...

More Telugu News